Monday, November 19, 2012
1 పోయినోల్లందరు మంచోల్లేనా ????
ఇగ ఈ మీడియా ను సూత్తాంటే నాకు ఓ అనుమానం వచ్చింది.
అది ఏందంటే పోయినోల్లందరు మంచోల్లేనా అని.
గిప్పుడు ఏంది వయ్య అనుకుంటున్నారా ఏంది.
ఆహా ఎంలే, మరాఠా పులి, రాజకీయ దురంధరుడు అని పెద్ద పెద్ద హెడ్డింగులు ఏవో జుషిన
అన్ని న్యూస్ ఛానళ్ళు పేపర్లు మస్తు టంకా బజాయిన్చినయి.
ఈ పెద్ద మనిషి చేసిన పాపాలు ఎవ్వరికి గుర్తు రాలే.
ఇగ సచ్చిపోయిన రాజ శేకర్ రెడ్డి అయితే మహానేత అని మనం రోజు చూస్తానే ఉన్నం.
ఇంక కొన్ని రోజులయితే దావుద్ ఇబ్రహీం ని కూడా ఇట్లానే మస్తు పొగుడ్తరేమో (సచ్చిపోయినక నే),
ఇంకో మస్తు జోక్ ఏందంటే, ప్రతి నాయకుడు సంతాపం ప్రకటించుడే!!! ఏందో !!!!
Labels:
దావుద్,
బాల్ ఠాక్రే,
వై.ఎస్.
Subscribe to:
Post Comments (Atom)
అంతేకదా అన్నా మరి. మొన్న ఎవరో రావణాసురుడు కూడా మంచోడే, మా కులపోడే, జై జై రావణా అని అంటుండ్రు టీవీల సూసిన. గట్లకాదు గని, ఎంత మంచోడు కాకపొయిన ఎవలకో కొందరికి జరంత సాయం చెసిండ్రని గట్ల చెపుతరు. గట్లంటే, రావణాసురుని అంత మంచి శివభక్తుడు ఇంకెవరూ లేరు అంటరు తెలుసా? అన్ని ఈ షెవిలకెల్లి ఇనాలె ఆ షెవిలకెల్లి ఇడిసిపెట్టాలె.
ReplyDelete